వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో అశాంతి తప్పదు: జార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాలిబాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పనిచేయాలనే పాకిస్థాన్‌ నిర్ణయం ఆ దేశంలో పౌర,సైనికపరమైన అశాంతికి దారి తీసే ప్రమాదం ఉన్నదని, ఇది దేశ పునాదినే కదలిస్తుందని భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ అన్నారు. పాకిస్థాన్‌లో తలెత్తే అశాంతి బారత్‌కు కూడా ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు.
భారతదేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి పాకిస్థాన్‌ తాలిబాన్‌ను వాడుకున్నదని, ప్రస్తుతం గత 54 ఏళ్ల చరిత్రలో లేని విధంగా అమెరికాతో కలిసి తాలిబాన్‌పై పోరు సల్పడం పాకిస్థాన్‌కు చేదు మాత్రమింగినట్లే వుంటుందని ఆయన మంగళవారం ఒక సదస్సులో అన్నారు.

అమెరికా కోరిక మేరకు పాకిస్థాన్‌ పోషించే పాత్ర పాకిస్థాన్‌లో పౌర,సైనిక అశాంతులకు దారి తీస్తుందని, ఇది పాకిస్థాన్‌ జాతీయత మనుగడకే ప్రమాదం కలుగజేస్తుందని, అదే సమయంలో భారత్‌కు ఆందోళన కారణమవుతుందని ఆయన అన్నారు.పాకిస్థాన్‌ విచ్ఛిన్నమైతే ఉప ఖండంలో సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఆయన అన్నారు.

అఎn్ఘానిస్థాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా ఒసామాబిన్‌ లాడెన్‌ను పట్టుకునే తన లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చునని ఆయన అన్నారు. ఈ ఆశయం సాధించకుండా అమెరికా దాడులు ఆగిపోవచ్చునని ఆయన అన్నారు.అఎn్గాన్‌పై అమెరికా దాడులు ఆగిన తర్వాత భారత్‌ ఉగ్రవాదంపై తన సొంత పోరును ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ భారత్‌ సహనాన్ని పరీక్షిస్తోందని, పాకిస్థాన్‌ వద్ద ఉన్న అణ్వాయుధాల వల్ల బారత్‌కు ముప్పేమీ లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X