ప్రత్యర్థులపై కపిల్ బిగ్ ధమాకా
కటక్: మ్యాచ్ఫిక్సింగ్ కుంభకోణంలో తన వీధికీడ్చినవారు వణికిపోయేలా బిగ్ బ్యాంగ్తో ముందుకు వస్తానని క్రికెట్ ప్రముఖుడు కపిల్ దేవ్ అన్నారు. నేను బిగ్ ధమాకాతో ముందుకు వస్తాను. అది కనీసం ఐదు రోజుల పాటు మీడియాలో హంగామా సృష్టిస్తుంది అని కపిల్ అన్నారు.
తనపై
సహ
క్రికెట్
క్రీడాకారుడు
ఆరోపణలు
చేయడంపై
మాట్లాడడానికి
ఆయన
ఇష్టపడలేదు.
మీడియా
వంద
రోజుల
పాటు
తన
గురించి
మొదటిపేజీలో
రాసిందని
మాత్రమే
ఆయన
అన్నారు.
మొదటిపేజీలు
రాజకీయ
నాయకులకు
కేటాయించినవి.
నేను
స్పోర్ట్స్పేజీలో
వుండడానికే
ఇష్టపడతాను
అని
ఆయన
అన్నారు.
పరిమిత
ఓవర్ల
ఫైనల్స్లో
వరుసగా
తొమ్మిది
అపజయాలకు
సంబంధించిన
పరిణామాల
గురించిపెద్దగా
ఆలోచించాల్సిన
అవసరం
లేదని
ఆయన
అన్నారు.కొన్ని
సార్లు
అలా
జరుగుతుంది.
జట్టుపై
మనంవిశ్వాసం
వుంచాలి.
ఫైనల్స్కు
చేరుకోవడానికి
ప్రతిసారీ
భారత
జట్టు
బాగా
ఆడుతున్నారనే
విషయాన్ని
గుర్తుంచుకోవాలి
అని
కపిల్
అన్నారు.
ఇటీవలి కాలంలో భారత క్రికెట్ క్రీడాకారులు తరుచుగా గాయాల బారిన పడుతుండడాన్ని ప్రస్తావిస్తూ వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ వుండవచ్చు అని అభిప్రాయపడ్డారు. తాను గాయపడకుండా తన కెరీర్ వుండడమనేది తన అదృష్టం కావచ్చునని ఆయన అన్నారు. భారత జట్టు క్రీడాకారులు ఆఫ్సీజన్లో కష్టపడితే మ్యాచ్ల్లో బాగా రాణిస్తారని ఆయన చెప్పారు.
వ్యాపారంలో తాను పూర్తిగా నిమగ్నమై వున్నానని, గోల్ఫ్పై దృష్టిపెట్టానని ఆయన చెప్పారు. నేను ప్రతి రోజు నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాను. స్పోర్ట్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నా లక్ష్యం అని కపిల్ దేవ్ అన్నారు.