వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహబూబ్నగర్ః మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కర్నూలు నుంచి బండలతో హైదరాబాద్ వస్తున్న లారీ గోదావరిఖనినుంచి మహబూబ్నగర్ వెళ్తున్న డిసిఎం వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మరణించిన ముగ్గురు మహబూబ్నగర్ జిల్లా వాసులని పోలీసులు చెప్పారు. కొత్తూరు ప్రాంతంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి సమీపంలోనే కొత్తూరు హైవే పై వుంది. డ్రైవర్ల దూకుడే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, November 2, 2001, 23:53 [IST]