చీఫ్ జస్టిస్గా భరూచా ప్రమాణం
న్యూఢిల్లీఃదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్పి భరూచాబుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.జస్టిస్ ఆనంద్ పదవీవిరమణ చేయడంతోఆయన స్థానే జస్టిస్ భరూచా బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రపతి కెఆర్నారాయణన్ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒకకార్యక్రమంలో జస్టిస్ భరూచాతో ప్రమాణ స్వీకారంచేయించారు. ప్రధాని వాజ్పేయి ఆయన కేబినెట్సహచరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానన్యాయమూర్తిగా అక్టోబర్ 1998లో బాధ్యతలు చేపట్టినజస్టిస్ ఆనంద్ సుమారు మూడున్నర ఏళ్లు ఆపదవిలో కొనసాగారు. ఆ వారసునిగా పదవీబాధ్యతలుస్వీకరిస్తున్న జస్టిస్ భరూచాకు పలు కీలకమైనకేసుల్లో సంచలనాత్మకమై తీర్పులు వెలువరించిన రికార్డువుంది. జయలలితకు అధికారంలో కొనసాగేహక్కులేదని తీర్పుచెప్పిన సుప్రీంకోర్టుధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించారు. రాజ్కుమార్అపహరణ కేసులో తమిళనాడు, కర్ణాటకప్రభుత్వాలు వీరప్పన్కు లొంగిపోకుండా ఆయనిచ్చిన తీర్పు తీవ్ర సంచలనంసృష్టించింది.