వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతః టెర్రరిజం అణిచివేతకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న టెర్రిరిజం నిరోధక ఆర్డినన్స్‌(పోటో) అమలుకోసం రాష్ట్రప్రభుత్వాలను ఒత్తిడి చేసే సమస్యే లేదని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ప్రమోద్‌మహాజన్‌ స్పష్టం చేశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కతః టెర్రరిజం అణిచివేతకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న టెర్రిరిజం నిరోధక ఆర్డినన్స్‌(పోటో) అమలుకోసం రాష్ట్రప్రభుత్వాలను ఒత్తిడి చేసే సమస్యే లేదని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ప్రమోద్‌మహాజన్‌ స్పష్టం చేశారు.

అయితే టెర్రరిస్టుల నుంచి అమాయక ప్రజలను రక్షించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని ఆయనపేర్కొన్నారు. పోటో అమలు రాష్ట్రాల యిష్టానిష్టాలకు వదిలిపెడుతున్నట్టుగా ఆయన వెల్లడించారు.

పోటోను తమ రాష్ట్రంలో ఉపయోగించరాదని పశ్చిమబెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఎద్దేవా చేశారు. టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి మెషిన్‌గన్‌ కంటే కర్రనే మేలనుకునే రాష్ట్రాలను అలాగే పోనియాలని ఆన్నారు. వామపక్ష ప్రభుత్వం టెర్రరిస్టులను సంస్కరించదల్చుకున్నదా అని ఆయన ఎగతాళిగా ప్రశ్నించారు. పోటో లేకుండా టెర్రరిజాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X