న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిని కఠినంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
సిగరెట్
పరిశ్రమకు
గొడ్డలిపెట్టుగా
చెప్పదగిన
ఈ
నిషేధం
వల్ల
ప్రజారోగ్యంలో
గణనీయమైన
మెరుగుదల
వుండే
అవకాశం
వుంది.
మహారాష్ట్రకు
చెందిన
కాంగ్రెస్
నేత
మురళీదేవర
దాఖలు
చేసిన
ప్రజాప్రయోజన
వ్యాజ్యంపైవిచారణ
జరిపిన
న్యాయమూర్తులు
జస్టిస్
ఎంబి
షా,
జస్టిస్
సేథీతో
కూడిన
ధర్మాసనం
ఈ
తీర్పును
వెలువరించింది.
రైళ్లు, బస్సులతో సహా పబ్లిక్ట్రాన్స్పోర్టుకు సంబంధించిన అన్ని వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని కోర్టు నిషేధించింది. అడ్వర్టయిజ్మెంట్ నియమాలను ఉల్లంఘించిన సిగరెట్ ఉత్పత్తిదారులపై తీసుకున్న చర్యలతో నివేదికను సమర్పించాల్సిందిగా ఢిల్లీ, ముంబాయి, కోల్కత, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల పోలీసు కమిషనర్లను కూడా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వల్ల ఆస్పత్రులు,విద్యాసంస్థలు, కోర్టుల ప్రాంగణం, లైబ్రరీలు, ఆడిటోరియం వంటి ప్రాంతాలకు ఈ నిషేధం వర్తిస్తుంది.