వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాయపూర్ః ఎన్డిఎ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డిఎ దేశాన్ని ఓ ఒక్కరంగంలో కూడా ముందుకు నడిపించలేకపోయిందని ఆమె తూర్పారబట్టారు.
శుక్రవారం నాడు చత్తీస్గడ్ రాష్ట్రావతరణ ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయడంలోవిఫలమైన ఎన్డిఎ ప్రభుత్వం పోటో లాంటి నల్లచట్టాలను ప్రవేశపెడుతున్నదని ఆమెవిమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన ఎన్డిఎ ప్రభుత్వం తనవిధానాలతో ప్రజలను వంచిస్తున్నదని ఆమెపేర్కొన్నారు. దేశాన్ని పాలించగల అర్హత అన్నిరకాలుగా కాంగ్రెస్కు మాత్రమే వున్నదన్నవిషయం ఎన్డిఎ కారణంగా ప్రజలకు అవగతమైందని ఆమె చెప్పారు.
Comments
Story first published: Friday, November 2, 2001, 23:53 [IST]