వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలో కొనసాగుతున్న నక్సల్స్‌ హింస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు శనివారం రాత్రి మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక కాంట్రాక్టర్‌ను హత్య చేయడంతో పాటు రెండు పోలీసుస్టేషన్లపై దాడికి ప్రయత్నించారు. ఒక ప్రయివేట్‌పేపర్‌ మిల్లును పేల్చి వేశారు.

పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నర్సాపూర్‌ దళానికి చెందిన నక్సలైట్లు మెదక్‌ జిల్లా కాజీపేటలోకె. బిక్షపతి (42) అనే కాంట్రాక్టర్‌ను హత్య చేశారు. దీనికి తోడువిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని రెండు పోలీసుస్టేషన్లపై పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌ దాడికి ప్రయత్నించారు. పోలీసులు ఈ దాడి ప్రయత్నాలను తిప్పికొట్టారు. 20 నుంచి 30 మంది నక్సలైట్లు వై. రామవరం పోలీసుస్టేషన్‌లోని పోలీసులపై కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతంలో ప్రారంభమైన కాల్పులు 40 నిమిషాల పాటు కొనసాగాయి.

విశాఖపట్నం జిల్లాలో కొయ్యూరు పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసి ఆయుధాలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తులై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నక్సల్స్‌ పారిపోయారు. రాజమండ్రికి సమీపంలోనివిశ్వహిందూ పరిషత్‌కు సమీపంలో గల ఆంధ్రపేపర్‌మిల్లు కార్యాలయాన్ని, గెస్ట్‌హౌస్‌ను నక్సల్స్‌ పేల్చివేశారు. కొయ్యూరులోని ఎమ్వార్వో కార్యాలయాన్ని కూడా నక్సల్స్‌పేల్చి వేశారు. తెలుగుదేశం శాసనసభ్యుడుఎం.వి.వి. సత్యనారాయణరావుకు చెందిన రెండు ఇళ్లను కూడాపేల్చి వేశారు. గూడెం కొత్త వీధిలోని టెలిఫోన్‌ఎక్స్ఛేంజీని నక్సల్స్‌ దగ్ధం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X