వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికి కేంద్ర సాయం: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశాభివృద్ధిలో తమ వంతు పాలు పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తగిన సహాయ సహాయకారాలుఅందిస్తుందని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్నారు. హైదరాబాద్‌కు ఒక రోజు పర్యటన కోసం ఆయన ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనలాల్‌బహాదూర్‌ స్టేడియంలో రెండు వేల కోట్లతో తలపెట్టిన వాల్మికీ అంబేడ్కర్‌ ఆవాస్‌ యోజనను, మూసీ ప్రక్షాళన పథకాన్ని, మంచినీటి పథకాన్ని, ఆర్థిక జిల్లా ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

అంతకు ముందు ఆయన గచ్చిబౌలీలోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ స్కూల్‌లో చదివేవిద్యార్థులు రాష్ట్రానికి, దేశానికి సేవ చేసి తమ గురు దక్షిణ తీర్చుకోవాలని ప్రధాని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ను, హైటెక్‌ సిటీని సాధించి, అత్యంత వేగంగా పూర్తి చేశారని ఆయన కొనియాడారు. ఈవిషయంలో చంద్రబాబునాయుడు చేసిన ప్రత్యేక కృషిని ఆయన ప్రశంసించారు.

బిజినెస్‌ స్కూల్‌కు అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బిజినెస్‌ మేనేజర్స్‌ను దేశంకోసం, ప్రపంచం కోసం ఈ స్కూల్‌ తయారు చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌సి. రంగరాజన్‌, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకు ముందు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన వాజ్‌పేయి బేగంపేటవిమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్‌సి. రంగరాజన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకుస్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు, పార్లమెంటు సభ్యులు ఆయనకుస్వాగతం చెప్పారు. రాష్ట్ర మంత్రులను ఒక ప్రత్యేక వేదిక ద్వారా ముఖ్యమంత్రి ప్రధానికి పరిచయం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X