వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమంతా పల్స్‌పోలియో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌సి. రంగరాజన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల ప్రారంభించారు.

రాష్ట్రంలోని దాదాపు ఆరు లక్షల మంది పిల్లలకు పోలీయో చుక్కలు వేయడానికి 65 వేల బూత్‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని చింతలబస్తీలోని ఒక పాఠశాలలో ఒక శిశువుకు గవర్నర్‌ రంగరాజన్‌ పోలియో చుక్కలు వేశారు.

పోలియో చుక్కల కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని, గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమం అమలవుతోందని, రాష్ట్రంలో పిల్లలకు గత రెండేళ్లుగా పోలియో రావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే ఏడాది నుంచి విధిగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చూస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణకు కూడా సమర్థంగా అమలవుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X