వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీః రావణకాష్ఠంలా మండుతున్న కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా రెండు పరిష్కారాలు సూచించారు. వాస్తవాధీన రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడం ఒక పరిష్కారం కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో వున్న తీవ్రవాద క్యాంపలపై బాంబు దాడులు చేయడ మరో పరిష్కార మార్గం.
ఈరెండు సూచనలను చాలా కాలంగా చేస్తునే వున్నాను.... నా మాట ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన గురువారం కొత్తఢిల్లీలో దక్షిణాసియాలో తీవ్రవాదం అనేఅంశంపై జరిగిన సదస్సులో ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలోని
కొందరు
రాజకీయ
నాయకులు
ఈప్రతిపాదనను
వ్యతిరేకిస్తున్నారనిఅందువల్లో
కాశ్మీర్
లో
నిత్యం
మారణహోమం
జరుగుతున్నదని
ఆయన
అన్నారు.
అమెరికా
తనకు
వెయ్యి
కిలోమీటర్ల
దూరంలో
ఆఫ్ఘనిస్తాన్
లో
వున్న
తీవ్రవాద
శిబిరాలను
ధ్వంసం
చేయగా
లేనిది
కూతవేటు
దూరంలో
వున్న
పాక్
ఆక్రమిత
కాశ్మీర్
లోని
తీవ్రవాద
సంస్థలను
భారత్
ధ్వంసం
చేస్తే
తప్పేమిటని
ఆయన
ప్రశ్నించారు.
ప్రస్తుత
దశ్లో
భారత్
బాంబింగ్
కు
పాల్పడినా
ఎవరూ
అభ్యంతరం
చెప్పరని
ఆయన
అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Thursday, December 6, 2001, 23:53 [IST]