వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొహాలీః డిసెంబర్ 11 నుంచి అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే రెండోటెస్ట్ కు పాతకాపు జవగళ్ శ్రీనాధ్, హార్డ్ హిట్టర్వీరేంద్ర సెహవాగ్ ను ఎంపిక చేశారు. మొదటిటెస్ట్ కు ఎంపిక చేసిన బరోడా బ్యాట్స్ మెన్ జాకబ్ మార్టిన్,రైల్వేస్ ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ లను జట్టు నుంచి తప్పించారు. బిసిసిఐ కార్యదర్శి నిరంజన్ షా గురువారం ఈవిషయాన్ని వెల్లడించారు.
సౌతాఫ్రికా పర్యటన అనంతరం గాయం కారణంగా శ్రీనాధ్ ను తొలిటెస్ట్ కు ఎంపిక చేయలేదు. ఐసిసితో కుదుర్చుకున్న ఒప్పందం గారణంగావీరేంద్ర సెహవాగ్ ను తొలి టెస్ట్ కు ఎంపిక చేయని బిసిసిఐ ప్రతిష్ఠ కోసంఅయినా రెండో టెస్ట్ కు ఎంపిక చేసింది.
వాస్తవానికి సంజయ్ బంగర్ చక్కగా ఆడి 39 పరుగులు సాధించాడు. జట్టుకు ఆల్ రౌండర్ల అవసరం అదికూడా మిడిల్ ఆర్డర్ లో బాగా వున్న తరుణంలో సంజయ్ వంటి యువ ఆటగాళ్ళను బిసిసిఐ ఇలా నిరుత్సాహ పరచడంవిచారకరం. ఈ రెండు మార్పులు మినహా తొలిటెస్ట్ లో ఆడిన జట్టు యథాతథంగా అహ్మదాబాద్టెస్ట్ లో పాల్గొంటుంది. అహ్మదాబాద్ పిచ్ బాగ్ స్పిన్ పిచ్ కావడంతో కుంబ్లే హర్భజన్ కు తోడుగా మరో స్పిన్నర్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి.
Comments
Story first published: Thursday, December 6, 2001, 23:53 [IST]