వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః భద్రాచలంలోని గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన అయిదుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని లయోలా కాలేజీకి చెందిన శ్రీధర్రెడ్డి, జనార్ధన్, ఆనంద్, పవన్గా మృతులను గుర్తించారు.
ఈవిద్యార్ధులు విహారయాత్ర కోసం భద్రాచలం వెళ్లారని తెలిసింది. లయోలా స్కూల్కు చెందిన మొత్తం 67 మందివిద్యార్ధులు విహారయాత్ర కోసం భద్రాచలం వెళ్లారు. వారిలో కొందరు గురువారం ఉదయం స్నానాలకని గోదావరికి వెళ్లగాఅందులో అయిదుగురు విద్యార్ధులు నదీప్రవాహంలో కొట్టుకుపోయారు. మృతదేహాల కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
Comments
Story first published: Thursday, December 6, 2001, 23:53 [IST]