వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః విహారయాత్ర విషాదాంతంగా మారడంతోవిద్యార్థుల తల్లిదండ్రులు భోరుమంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన లయోలా పబ్లిక్ స్కూల్ కు చెందిన 67 మందివిద్యార్థులు భద్రాచలం విహారయాత్రకు వెళ్ళారు.వీరంతా గురువారం సాయంత్రానికి హైదరాబాద్ తిరిగి రావలసి వుంది.వీరంతా 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు.
భద్రాచల రామచంద్రుడు దర్శనానికి ముందు స్నానానికి అని నీటిలోకి దిగినవిద్యార్థుల్లో ఐదుగురు ప్రవాహం ఉదృతికి కొట్టుకు పోయారు.వీరిలో పి.జనార్దన్ అనే విద్యార్థి మృతదేహం మాత్రం ఇప్పటి వరకు లభ్యమైంది. గల్లంతయినమిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సంతోషంగా విహారయాత్రకు వెళ్ళిన తమ సహచరులు ఇలా కష్టాల్లో పడడంతో లయోలా మోడల్ స్కూల్ లోవిషాద ఛాయలు అలముకున్నాయి. గోదావరిలో గల్లంతయిన వారి తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.
Comments
Story first published: Thursday, December 6, 2001, 23:53 [IST]