వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చత్తీస్‌ ఘడ్‌ః పీపుల్స్‌ వార్‌ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి 24 గంటలు గడవక ముందే నక్సలైట్లు చత్తీస్‌ ఘడ్‌ లో విధ్వంసం సృష్టించారు. రెండు చోట్ల మందు పాతరలు అమర్చి విధ్వంసానికి ప్రయత్నించారు. చత్తీస్‌ ఘడ్‌ దెంతేవాడ జిల్లాలోని కొంటా బ్లాక్‌ కార్యాలయాన్ని నక్సలైట్లు మందుపాతరతో పేల్చి వేశారు. అయితే మందుపాతర సరిగా పేలకపోవడంతో భవనం పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నది.

By Staff
|
Google Oneindia TeluguNews

చత్తీస్‌ ఘడ్‌ డి.జి.పి. ఆర్‌.ఎల్‌.ఎస్‌. యాదవ్‌ గురువారం ఈవిషయాన్ని వెల్లడించారు. ఇదా జిల్లాలోని భేజీ మార్కెట్‌ లో నక్సలైట్లు మరో మందు పాతరపేల్చారు. ఈ రెండు సంఘటనల్లో ఎవరూ గాయపడలేదని ఆయన చెప్రారు. ఇదే జిల్లాలోని జాగర్‌ గుండా గ్రామంలో మహాత్మా గాంధీవిగ్రహాన్ని నక్సలైట్లు ధ్వంసం చేశారు. తమపై కేంద్ర నిషేధం విధించడానికి నిరసనగా బస్తర్‌ ప్రాంతంలో బంద్‌ కు వార్‌ ఇచ్చిన పిలుపునకు పాక్షికంగా స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్‌,ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని బస్తర్‌ పైఎం.సి.సి. పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లకు మంచి పట్టు వుంది. చత్తీస్‌ ఘడ్‌ లోని 16 జిల్లాల్లో ఆరు జిల్లాలలో నక్సలైట్లు కార్యకలాపాలు చురగ్గా సాగుతున్నాయని డిజిపి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X