వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాలు శుక్రవారం నాడు చిన్నారుల కేరింతలు,విమాన విన్యాసాలతో హోరెత్తిపోయాయి. ట్యాంక్ బండ్ పై ఉత్సవ వాతారణం నెలకొంది. పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు పర్యాటక శాఖ-భారతవైమానిక దళం ఎయిర్ షో నిర్వహించింది. ఈ ఎయిర్ షో ను బాలలు తిలకించేందుకువీలుగా శుక్రవారం జంటనగరాలలోని పాఠశాలలకుసెలవ ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు ఎయిర్ షో ను తిలకించేందుకు తరలి వచ్చారు.
నక్లెస్ రోడ్డులో చేతక్,ఆకాశగంగ, సూర్యకిరణ్ విమానాలు నిర్వహించినవిన్యాసాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. రాష్ట్రప్రభుత్వం పర్యాటక రంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదనిఅందులో భాగంగానే ఇటువంటి ఆకర్షణీయమైన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.
Comments
Story first published: Friday, December 7, 2001, 23:53 [IST]