వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః రాజ్యాంగం పరిధికి లోబడి నక్సలైట్లతో చర్చలు జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని హోం మంత్రి దేవేందర్గౌడ్ చెప్పారు. ప్రభుత్వ అధికారమంతా చట్టానికి రాజ్యాంగానికి లోబడి వుంటుందని ఆయన చెప్పారు.
చర్చలు, సంప్రదింపులు అన్నీ రాజ్యాంగ పరిధిలోనే వుంటాయని ఆయన చెప్పారు. నక్సల్స్తో చర్చలవిషయంలో తాము ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నట్టుగా కొన్ని సంఘాలు చేస్తున్నవిమర్శలను ఆయన ఖండించారు. రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించనివారితో చర్చలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
నక్సల్స్విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ద్వంద్వ వైఖరి అవలంభించలేదని ఆయన స్పష్టం చేశారు. పోటో కిందపీపుల్స్వార్పై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వంపెద్దగా పట్టుబట్టలేదని ఇతర రాష్ట్రాల డిమాండ్ వల్లనే వార్ను నిషేధించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వార్పై ఇప్పటికే నిషేధం వున్నందువల్ల కొత్త నిషేధంతోఒరిగేదేమీ లేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, December 7, 2001, 23:53 [IST]