వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః పాతబస్తీ వాసుల కోసం 10వేల ఇళ్ళతో ప్రత్యేక కాలనీ నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.అస్తవ్యస్తమైన నిర్మాణాలతో పాతబస్తీ కలగాపులగంగా తయారైందని, పాతబస్తీ వాసుల కష్టాలు తొలగించేందుకు 10 వేల ఇళ్ళతో ప్రత్యేకటౌన్ షిప్ నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. పాతబస్తీలో వుంటున్న కొంతమందిని ఈటౌన్ షిప్ కు తరలిస్తామని ఆయన వివరించారు. హైదరాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకుల శిక్షణా శిబిరాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రసంగించారు.
త్వరలో జరగబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించినవిజయాలను ప్రజలకు వివరించాలని ఆయనకోరారు. దేశంలోనే వినూత్నమైన పథకాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆయన చెప్పారు. ఇదే వేగంతో ముందుకు సాగితే గడువుకు ముందేస్వర్ణాంధ్రప్రదేశ్ ను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Story first published: Friday, December 7, 2001, 23:53 [IST]