వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీః పోటో చట్టంలో మూడు సవరణలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాలు ఆ చట్టాన్ని ఆమోదించేది లేదని భీష్మిస్తున్నాయి. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, వామపక్షాలు పోటో చట్టాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. ఎన్టీఏ ప్రభుత్వం తన భాగస్వామ్య పార్టీలను సంతృప్తి పరచేందుకే మొక్కుబడిగా రెండు మూడు సవరణలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శించారు. పోటోను ప్రస్తుత రూపంలో ఆమోదించే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
పోటోపై ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేయగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీఅయిన డి.ఎం.కె. మాత్రం అసలు పోటో చట్టమే అవసరం లేదని తేల్చి చెప్పింది. డిఎంకె ఏదంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే జయలలిత మాత్రం సహజంగానే పోటోను సమర్థించింది. పోటో నుఅస్త్రంగా ఉపయోగించి కరుణానిధిపై కక్ష సాధించేందుకే జయ ఈ ఎత్తుగడ వేస్తున్నదని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Story first published: Friday, December 7, 2001, 23:53 [IST]