వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టోక్యోః ఐదురోజుల పర్యటన కోసం భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శుక్రవారం జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని తన పర్యటనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలతో పాటు వివిధ రంగాలలో జపాన్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
అంతకు ముందు ప్రధాని వాజ్పేయికి కొత్తఢిల్లీ విమానాశ్రయంలో సీనియర్ మంత్రులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వాజ్పేయి విలేకరులతో మాట్లాడుతూ పోటో చట్టంలో ప్రతిపక్షాల అభ్యంతారను దృష్టిలో వుంచుకొని కొన్ని సవరణలు చేశామన్నారు. దేశభద్రతకు ఉపయోగపడే ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు ఇక రాద్ధాంతం చేయకుండా ఆమోదించాలని వాజ్పేయి కోరారు. వాజ్ పేయి జపాన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాకే పోటో చట్టాన్ని పార్లమెంటు ఆమోదానికి చేపట్టే అవకాశం వున్నదని భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, December 7, 2001, 23:53 [IST]