వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భద్రాచలంః రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం లయోలా పబ్లిక్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థులు ఐదుగురు గోదావరి నదిలో మునిగిపోయిన విషయం విదితమే. వీరిలో ఒకరి మృతదేహం గురువారం లభ్యమైంది. గల్లంతైన మిగిలిన నలుగురు మృతదేహాల కోసం గజ ఈతగాళ్ళు ముమ్మరంగా గాలింపు జరపగా భద్రాచలం - కూనవరం మధ్య నలుగురు మృత దేహాలు శనివారం ఉదయం కనిపించాయి.
మృతులను తొమ్మిది, పదో తరగతి చదువుతున్న శ్రీధర్ రెడ్డి, పవన్, రవీంద్ర రెడ్డి, అనంత కృష్ణగా గుర్తించారు. విహార యాత్రకు అని వచ్చి గోదావరిలో స్నానానికి దిగిన ఈ ఐదుగురు ప్రవాహం ఉదృతికి కొట్టుకుపోయినవిషయం విదితమే.
Comments
Story first published: Saturday, December 8, 2001, 23:53 [IST]