వాషింగ్టన్: అమెరికా, భారత్లు మరింత దగ్గరవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అన్నారు. పాకిస్థాన్కు తాము దగ్గరవుతున్నప్పటికీ భారత్, అమెరికాల మధ్య సంబంధాలకు విఘాతం కలగడం లేదని ఆయన అన్నారు. దక్షిణ కరోలినా చార్లెస్టన్లోనిమిలిటరీ కాలేజీలో ఆయన మాట్లాడారు.
భారత, అమెరికాలు కొత్త సహకార బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాదం నుంచి నాగరికతకు ఎదురవుతున్న కొత్త ప్రమాదం నేపథ్యంలో పాత పంథాల్లోని శత్రుత్వాలను, అసంతృప్తులను విడనాడి వివిధ దేశాలు ఏకమవుతున్నాయని ఆయన అన్నారు.
రష్యా, అమెరికాలు నూతన సహకార బంధవ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాయని, గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలుగా జర్మనీ, జపాన్లు తమ స్థాయికి తగిన విధంగాసైనిక పాత్ర పోషిస్తున్నాయని, నైతిక, సైద్ధాంతిక విభజనకు సంబంధించి అత్యధిక దేశాలుఒకే వైపు ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రపంచంలోని ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామని, ఈవిషయంలో అమెరికాను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం, డబ్బులు, శిక్షణ ఇస్తున్నావారి అంతు కూడా చూస్తామని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదుల వద్ద రసాయన, జీవాయుధాలున్నాయని, వాటిని నాశనం చేయాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు.