వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అహ్మదాబాద్: భారత్తో జరుగుతున్న రెండవ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండు 407 పరుగులకు అలవుట్అయింది. 277 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం ఉదయం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండు నిలకడగా ఆడి స్కోర్ను 407 పరుగులకుపెంచింది. మంగళవారంనాడు ఇంగ్లాండు ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే, బుధవారం లంచ్కు ముందు భారత బౌలర్లు ఇంగ్లాండు బ్యాట్స్మెన్పైపెద్దగా ప్రభావం చూపలేకపోయారు. టెయిల్ ఎండ్ బ్యాట్స్మన్ ఫోస్టర్, వైట్ భారత బౌలర్లను సమయస్ఫూర్తితో ఎదుర్కుని స్కోర్ను పెంచుతూ పోయారు.
ఒకానొక సమయంలో 185 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండు 250 పరుగులు కూడా చేయగలుతుందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే టెయిల్ ఎండ్ బ్యాట్స్మెన్ భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండును నడిపించారు. మంగళవారం ఐదువికెట్లు తీసుకుని ఇంగ్లాండును గడగడలాడించిన అనిల్ కుంబ్లే బుధవారం రెండువికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే ఏడువికెట్లు తీసుకున్నాడు. మరో స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్కు ఒకవికెట్ మాత్రమే లభించింది. శ్రీనాథ్ ఒక వికెట్ను పడగొట్టాడు. సచిన్ టెండూల్కర్కు ఒకవికెట్ లభించింది.
Comments
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]