వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచు అలుముకోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం సాధారణ జనజీవితంఅస్తవ్యస్తమైంది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
దట్టమైన పొగమంచు వల్ల ఇందిరాగాంధీ అంతర్జాతీయవిమానాశ్రయం నుంచి విమానాలు బయలుదేరలేకపోయాయి. బయటి నుంచి వచ్చినవిమానాలు దిగలేకపోయాయి. సాయంత్రానికి గానీ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోకవచ్చునని అధికార వర్గాలంటున్నాయి.
ఢిల్లీ నుంచి రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. దీంతో ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. ఢిల్లీలో మరో రెండు రోజుల వరకు ఇదే విధంగా దట్టమైన పొగమంచు అలుముకుంటుందని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులు అంటున్నారు.
Comments
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]