వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ జాడ అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలకు తెలిసింది.అఎn్ఘానిస్థాన్లోని తొరబోరా పర్వత ప్రాంతాల్లో లాడెన్, ఆల్ ఖయిదాసీనియర్ నేతలు ఉన్న చోటును ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టినట్లు ఎబిసి న్యూస్ తెలియజేసింది.
తన ముఖ్య కమాండర్లతో పాటు లాడెన్ ఉన్న చోటికి తాలిబాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నసైనికులు చేరుకుంటున్నట్లు అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అత్యంత శక్తివంతమైన డైసీ కట్టర్ బాంబులను మంగళవారం అమెరికా తొరబోరాపర్వత ప్రాంతాల్లో ప్రయోగించింది. ఈ సమయంలో భయాందోళనలతో కూడిన ఆల్ ఖయిదా నేతల రేడియో, శాటిలైట్ ధ్వనులువినిపించినట్లు ఎబిసి న్యూస్ కథనం. ఇది లాడెన్, అతని ముఖ్య అనుచరుల జాడను పట్టిచ్చినట్లు ఎబిసి న్యూస్ అభిప్రాయపడింది.
ఈ
విషయాన్ని
ఖండించడానికి
గానీ,
ధృవీకరించడానికి
గానీ
వైట్
హౌస్,పెంటగాన్లు
ఇష్టపడలేదు.
Comments
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]