వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎట్టకేలకు లాలూకు బెయిలు
న్యూఢిల్లీః దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయజనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు బెయిలు మంజూరు చేసింది. జస్టిస్ కె.టి. థామస్, జస్టిస్ పుఖాన్ సారధ్యంలోని బెంచ్ లక్ష రూపాయల పూచీకత్తుపై లాలూకు బెయిలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని లాలూ పాట్నా కోర్టులో దాఖలుచేయాల్సి వుంది.
సుమారూ 20 రోజులుగా లాలూ జుడీషియల్ కస్టడీలో వున్నవిషయం విదితమే. దాణా కుంభకోణానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసులో లాలూకు సుప్రీంకోర్టుఅరెస్టు వారెంటు జారీ చేయగా ఆయన కోర్టు ఎదుట లొంగిపోయినవిషయం విదితమే.
Comments
Story first published: Friday, December 14, 2001, 23:53 [IST]