వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః దేశ భద్రతకు సవాలు విసురుతున్నవారు పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలనిప్రధాని వాజ్‌పేయి హెచ్చరించారు. ప్రభుత్వం అన్నింటికంటే దేశభద్రతకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

సోమవారం నాడు సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో వర్దమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీకి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరగిన సభలో మాట్లాడుతూ, దేశపురోభివృద్ధికి ఆర్ధికాభివృద్ధి ప్రధానమైనప్పటికీవిద్య, ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనవని ఆయన చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపు ఆర్ధికాభివృద్ధిపైనే దృష్టి నిలుపుతున్నామని ఆయన అన్నారు.వైద్య రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ రంగంలో భారత్‌ వెనకబడి వుండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X