హైదరాబాద్ః పార్లమెంట్పై టెర్రరిస్టుల దాడి పూర్తిగా ఎన్డిఎ ప్రభుత్వ వైఫల్యమని సీనియర్ కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్ధన్రెడ్డి పేర్కొన్నారు. పోటో చట్టం అమల్లో వుండగానే పార్లమెంట్పై దాడి జరిగిందని ప్రభుత్వానికి సత్తావుంటే దాడికి బాధ్యులైన వ్యక్తులను ముందుగానే అరెస్టు చేసి వుండాల్సిందని ఆయన అన్నారు.
తనవైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం ప్రతిపక్షాలమీద విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.భద్రతకు సంబంధించిన అంశాలపై రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్పైచేసిన విమర్శలపై నేదురుమల్లి, పిసిసినేత సత్యనారాయణరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు.పార్లమెంట్పై దాడికి సంబంధించి స్పష్టమైనముందస్తు సమాచారం వున్నదంటూనే దానినినిరోధించడంలో విఫలమైన ఎన్డిఎ ప్రభుత్వంఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల గురించిప్రస్తావించడాన్ని వారు ఎద్దేవా చేశారు. ఎర్రకోటపైదాడి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీపై దాడి నుంచి ప్రభుత్వంపార్లమెంట్కు ప్రమాదం వున్నదని చెబుతునేవున్నదని చివరికొచ్చేసరికి దాడిని మాత్రంనిరోధించలేకపోయిందని వారు అన్నారు. చంద్రబాబునాయుడు వంటి అసమర్ధ పాలకుని దగ్గరపాఠాలు నేర్చుకునే స్థితిలో కాంగ్రెస్ లేదనినేదురుమల్లి ఆగ్రహంగా అన్నారు. పోటోను సమర్ధించనివారంతా దేశద్రోహులనే స్థాయివరకు ఎన్డిఎనేతలు వెళ్లడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగాదుయ్యబట్టారు.