వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ఃఅసెంబ్లీ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచిప్రారంభం కానున్నాయి. అధికార ప్రతిపక్షాలుశాసనసభ వేదికపై అనేక విషయాలపైతలపడేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనమంత్రివర్గ సహచరులతో మంతనాలుజరిపి విపక్షాలను ఎదర్కునేందుకు వ్యూహాలనుఖరారు చేశారు.
మరోవైపుకాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి టిఆర్ఎస్,సిపిఎం, మజ్లిస్ వగైరా విపక్ష పార్టీలనుఆహ్వానించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకుకసరత్తులు జరిపారు. పనికి ఆహారం, బియ్యం సేకరణ,వెలుగోడు రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు,హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు, అక్వారైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకువిపక్షపార్టీల నేతలు సన్నద్ధంగా వున్నారు.మొత్తం పదిరోజుల పాటు ఈ సమావేశాలుజరుగుతాయి. పార్లమెంట్పై దాడి నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు అసాధారణ రీతిలోభద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలోసిబ్బందిని మొహరిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, December 18, 2001, 23:53 [IST]