కాబూల్ఃఅంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామాబిన్ లాడెన్,తాలిబన్ల కులగురువు ముల్లా ఒమర్భరతం పట్టే వరకు అఎn్గాన్ వదిలేసమస్యే లేదని అమెరికా స్పష్టం చేసింది.తమ ధాటికి తట్టుకోలేక తాత్కాలికంగా పర్వతాల్లోకివెనక్కి తగ్గిన అల్ఖైదా, తాలిబన్ దళాలుమళ్లీ సంఘటితమయ్యే అవకాశం వున్నదనిఅమెరికా అనుమానిస్తున్నది. అఎn్గాన్ యుద్ధంలెక్కప్రకారం చూస్తే ఇంకా పూర్తి కాలేదని అమెరికావిదేశాంగ మంత్రి డోనాల్డ్ రమ్స్ ఫీల్డ్చెప్పారు.
అల్ఖైదా,తాలిబన్ దళాలు రంగంలోంచి ఉపసంహరించుకున్నాయేతప్ప పూర్తిగా యుద్ధం నుంచి విరమించలేదనిఆయన అన్నారు. ఈ రెండు సంస్థల యోధులుతిరిగి సంఘటితమై కయ్యానికి కాలుదువ్వేఅవకాశం వున్నదని ఆయన చెప్పారు. ముల్లాఒమర్, ఒసామా బిన్ లాడెన్ తమకు దొరికే వరకుఈ రెండు పార్టీల సీనియర్ నేతలనుశిక్షించేవరకు అమెరికా బలగాలు అఎn్గాన్ వదిలేదిలేదని ఆయన చెప్పారు. అఎn్గాన్ తాత్కాలికప్రభుత్వ నేత హమిద్ కర్జాయ్తో బగ్రామ్వైమానికి స్థావరంలో చర్చలు జరిపిన రమ్స్ఫీల్డ్, అంతర్జాతీయ సంకీర్ణ సేనలతోపూర్తిగా సహకరించడానికి అఎn్గాన్ కొత్త నాయకత్వంసిద్ధంగా వున్నదని చెప్పారు. ఐక్యరాజ్య సమితిఆధ్వర్యంలో ఆరుదేశాలకు చెందిన మూడునుంచి అయిదువేల మంది సైనికులు అఎn్గాన్లోవుంటారని ఆయన చెప్పారు. అమెరికా దళాలు ఈఅంతర్జాతీయ సేనలో వుండవని అయితే అవసరమైనఅన్ని రకాల సహాయ సహకారాలన్నీ తాము అందజేస్తామనిరమ్స్ ఫీల్డ్ తెలిపారు.