వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్నోఃఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోవధపైసంపూర్ణ నిషేధాన్ని ప్రకటించింది. మంగళవారంనాడు అధికారికంగా ఈ విషయం ప్రకటించారు.రాష్ట్ర కేబినెట్ గతవారం చేసిన ఒక సిఫారసుఆధారంగా గవర్నర్ విష్ణుకాంత్ శాస్త్రి మంగళవారంనాడు ఆర్డినన్స్ జారీ చేశారు. ఇప్పటివకు కొన్నినిర్ధిష్ట పరిస్థితులకు లోబడి గోవధనుఅధికారులు అనుమతిస్తున్నారు.
అనారోగ్యంతోవున్న గోవులను, వట్టిపోయిన గోవులను,15 ఏళ్ల వయసు పై బడిన వాటిని కబేలాకుపంపడానికి అనుమతిస్తున్నారు. అయితే ఇలాంటికేసుల్లో వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ జారీచేయాల్సివుంటుంది. కొత్త ఆర్డినెన్స్ వల్లపాత నిబంధనలన్నీ రద్దవుతాయి. ఆవులు,గేదెలు, బర్రెలను ఇకపై కబేలాకు పంపడంనిషిద్ధం. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే శిక్షకఠినంగా వుంటుంది. గోవధతోప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా సంబంధం వుంటేఏడేళ్ల వరకు జైలు శిక్ష, పదివేల రూపాయలవరకు జరిమానా విధిస్తారు. వయసుడిగినపశువుల సంరక్షణకు ప్రభుత్వమేప్రత్యేక చర్యలు తీసుకుంటుందనిప్రకటించారు.
Comments
Story first published: Tuesday, December 18, 2001, 23:53 [IST]