వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీఃపాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ ఎ మహమ్మద్తీవ్రవాద సంస్థ భారత దేశంలోనిప్రధాన నగరాలపై దిమ్మతిరిగే దాడులుచేయనున్నట్టుగా ప్రకటించింది. తమదాడుల దెబ్బకు అధికార ఎన్డిఎ గద్దె దిగాల్సివుంటుందనిజైష్ హెచ్చరించింది.
పార్లమెంట్భవనంపై దాడితో సంబంధం వున్నట్టుగాతమపై వస్తున్న ఆరోపణలను మాత్రం జైష్తీవ్రంగా ఖండించింది. సంస్థ కమాండర్ ఇన్చీఫ్ అబూ హిజ్రత్ అధ్యక్షతన జరిగినఅత్యవసర సమావేశం తర్వాత ఈ మేరకు ఒకప్రకటనను జైష్ జారీ చేసింది. ప్రధానభారతీయ నగరాలపై తాము దిగ్భ్రాంతికలిగించే దాడులు జరిపి బిజెపిని గద్దె దించుతామనిజైష్ పేర్కొంది. రానున్న రోజుల్లో జమ్మూకాశ్మీర్లో తమ కార్యకలాపాలను ముమ్మరంచేయనున్నట్టుగా కూడా జైష్ పేర్కొంది. పారా మిలటరీ,మిలటరీ స్థావరాలపై తాముగురిఎక్కుపెట్టినట్టుగా జైష్ పేర్కొంది.
Story first published: Thursday, December 20, 2001, 23:53 [IST]