వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాంచిఃసుప్రీంకోర్టు ఉత్తర్వులతో బెయిల్పై జైలు నుంచివిడుదలైన 24 గంటల్లోనే ఆర్జెడి నేతలాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ 14 రోజుల పాటుజుడిషియల్ రిమాండ్లోకి వెళ్లారు. కోట్లాదిరూపాయల దాణా కుంభకోణానికి సంబంధించేమరో కేసులో లాలూ గురువారం నాడు రాంచిలోనిసిబిఐ కోర్టు ఎదుట లొంగిపోగా న్యాయమూర్తి పిఆర్దాస్ ఆయన్ను పద్నాలుగు రోజుల పాటురిమాండ్కు పంపారు.
ఈకుంభకోణానికి సంబంధించే బుధవారంనాడు లాలూకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది.సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసిన కేసు, రాంచి కోర్టు ముందున్న కేసురెండు దాణా కుంభకోణానికి సంబంధించినవేఅయినందున బెయిల్ రెండు కేసులకూ వర్తించాలనిలాలూ తరఫు న్యాయవాది పిఎన్ పాండే వాదించారు.అయితే సిబిఐ న్యాయవాది ఈ రెండు వేరు వేరుకేసులను లాలూ న్యాయవాది విజ్ఞప్తినితీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు ఒక్కకేసుకు సంబంధించే బెయిల్ మంజూరుచేసిందని దాణా కుంభకోణానికి సంబంధించినఇతర కేసుల్లో కూడా బెయిల్ ఇస్తున్నట్టుగా పేర్కొనలేదనిసిబిఐ న్యాయవాది సింగ్ వాదించారు.
Comments
Story first published: Thursday, December 20, 2001, 23:53 [IST]