వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః పంటకు మద్దతు ధర, నకిలీ విత్తనాలు రాష్ట్రరైతాంగాన్ని కుంగదీస్తున్నాయని ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశాయి. నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయినరైతాంగానికి ఎంత నష్ట పరిహారం ఇస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. నిజానికి ఈ ఏడాది నకిలీ విత్తనాల బెడద తగ్గిందని, గత ఏడాదితో పోలిస్తే ఫిర్యాదులు కూడా తక్కువగా వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సభకు చెప్పారు.
నకిలీ విత్తనాల వల్ల నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం పూర్తిగా నష్ట పరిహారం చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులను అన్ని విధాలా ఆదుకొనేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి వున్నదని వడ్డే చెప్పారు.
Story first published: Friday, December 21, 2001, 23:53 [IST]