వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః పశువుల కృత్రిమగర్భోత్పత్తి పథకంపై జరిగిన అవకతవకలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఈ అక్రమాలపై సభాసంఘాన్ని నియమించాలని డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాలు పట్టు విడవక పోవడంతో ఈ వ్యవహారంపై సభా సంఘాన్ని నియమించేందుకు ప్రభుత్వంఅంగీకరించింది.

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాలో ఈ పథకం అధ్యయనానికి జె.కె.ట్రస్ట్‌ అనే సంస్థకు 9 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డివిమర్శించారు. 1.30 కోట్ల రూపాలయలు మాత్రమే ఖర్చు కాగల ఈఅంశంలో ప్రభుత్వం 11కోట్లు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటని బిజెపిమినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.

ఇందులో దాపరికం ఏదీ లేదని, జె.కె. ట్రస్ట్‌స్వచ్ఛంద సంస్థ అయినందునే ఆ సంస్థకు పనులుఅప్పగించామని పశుసంవర్థక శాఖ మంత్రి నిమ్మల కిష్టప్ప సభకు చెప్పారు. మంత్రి సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదంటూ ప్రతిపక్షాలువిమర్శించాయి. ఈ లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి సమాధానంతో కూడా ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు.
ఈ వ్యవహారంపై సభాసంఘం వేస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయి కదా అని టి.ఆర్‌.ఎస్‌ నేత చంద్రశేఖర రావుకోరారు. ప్రతిపక్షాలు మొండిపట్టు పడుతున్నాయని, ఈఅంశంపై సభాసంఘాన్ని నియమించేందుకు తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పడంతో ప్రతిపక్షాలు శాంతించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X