వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామసచివాలయ వ్యవస్థ పై శుక్రవారం అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. గ్రామ సచివాలయ కార్యదర్శుల నియామకంలో అన్ని రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంతటి కీలకమైన వ్యవస్థలో రిజర్వేషన్ల అమలువిషయాన్ని ప్రభుత్వం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈఅంశంపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ప్రతిభా భారతి త్రోసిపుచ్చారు. ప్రతిపక్షాలు పట్టు పట్టడంతో ఈ సమావేశాల్లోనే గ్రామకార్యదర్శుల నియామకాల్లో రిజర్వేషన్ల అమలువిషయంపై లఘు చర్చకు అనుమతిస్తామని స్పీకర్‌ చెప్పారు.

గ్రామసచివాలయ వ్యవస్థలో కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమైందని, వారి నియామాకాల్లో రిజర్వేషన్లను అమలు చేసేది లేనిదీ తేల్చాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. కీలకమైన ఈఅంశంపై వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడం విడ్డూరంగా వుందని వై.ఎస్‌.విమర్శించారు. ఈసమావేశాల్లోనే లఘు చర్చకు అనుమతిస్తామనిస్పీకర్‌ హామీ ఇవ్వడంతో ప్రతిపక్షాలు శాంతించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X