వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులను అడ్డుకున్న కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: రాష్ట్ర మంత్రుల కార్యక్రమాలను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్‌ నేతలకు మధ్య ఘర్షణ చెలరేగింది. శంకుస్థాపన కార్యక్రమాల్లో, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇతర మంత్రులు ఆదివారం ఇక్కడికి వచ్చారు.
ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని మంత్రులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పర్యటనలుపెట్టుకుంటున్నారని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తూ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసు జీపు అద్దాలు పగులగొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులుఅరెస్టు చేశారు. వీరి అరెస్టు తర్వాత శంకుస్థాపన కార్యక్రమాలను మంత్రులు పూర్తి చేశారు. డ్వాక్రా మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు, రివాల్వింగ్‌ ఫండ్స్‌ పంచిపెట్టారు.

ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారా అని అడిగడానికి వెళ్లిన తమనుఅరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్‌ నాయకుడు కరుణాకర్‌ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X