వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌: సిరీస్‌ భారత్‌కైవసం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: ఇంగ్లాండుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0 స్కోర్‌తో గెల్చుకుంది. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో భారత్‌ సిరీస్‌నుకైవసం చేసుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌ ఐదవ రోజు ఆట ఏ మాత్రం నడవకుండానే ముగిసింది. మొదటి టెస్టు మ్యాచ్‌ను భారత్‌ గెల్చుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

శనివారం రాత్రి కురిసిన భారీ వర్ష వల్ల మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో మ్యాచ్‌ను ముగించాలనిఅంపైర్లు ఎ. జయప్రకాష్‌, అశోక డిసిల్వా ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలకు మొదటి నాలుగు రోజులు పది గంటలకుపైగా ఆట సాగలేదు. దీంతో ఈ మ్యాచ్‌ను గెలుచుకోవడానికి ఇంగ్లాండు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు భారత్‌పై 131 పరుగుల ఆధిక్యత సంపాదించుకుంది.అప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండు ఒక వికెట్‌ కూడా కోల్పోలేదు.

ఇంగ్లాండు జట్టు క్రిస్ట్మస్‌ పండుగకు స్వదేశానికి వెళ్లి ఆరు వన్టే టెస్టుల సిరీస్‌ ఆడటానికి జనవరి 12వ తేదీన తిరిగి వస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X