వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24న వాజ్‌పేయితోవిక్రమసింఘే భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల గురించి, జాతి సమస్య గురించి శ్రీలంక ప్రధాని రనిల్‌విక్రమసింఘే ఈ నెల 24వ తేదీన భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తంవిక్రమసింఘే ఆదివారంనాడు ఇక్కడికి వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌తో, హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీతో, వాణిజ్య, పరిశ్రమల మంత్రి మురసోలి మారన్‌తో కూడా ఆయన చర్చలు జరుపుతారు. ఆయన రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌ కలుసుకుంటారు.

విక్రమసింఘేతో పాటు శ్రీలంక విదేశాంగ మంత్రి టైరొన్నె ఫెర్నాండో కూడా ఇక్కడికివచ్చారు. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని, మాజీ ప్రధానులుపి.వి. నరసింహారావును, ఐ.కె. గుజ్రాల్‌ను కూడా కలుసకుంటారు.

పీపుల్స్‌ అలయెన్స్‌కు చెందిన చంద్రికా కుమారతుంగను ఇటీవల జరిగిన ఎన్నికల్లో మట్టి కరిపించిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీకి చెందినవిక్రమసింఘే భారత పర్యటనకు అత్యంత ప్రాధాన్యం వుందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X