వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనికి ఆహార పథకాన్ని పొడిగించం: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పనికి ఆహార పథకాన్ని పొడిగించడం కుదరదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఎన్‌ఐఆర్‌డి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆదివారం ఈవిషయం చెప్పారు.

పనికి ఆహారం పథకాన్నిజూన్‌ వరకు పొడిగించాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపిందని, అయితే ఈ పథకాన్ని డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత కొనసాగించబోమని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని మరో రూపంలో అమలు చేస్తామని, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన కింద రాష్ట్రానికి 50 లక్షల టన్నులబియ్యం ఇస్తామని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని 16 జిల్లాల అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని, మంచినీటి సౌకర్యాల కల్పనకు 65 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X