కోచ్ జాన్ రైట్ కొనసాగింపు
బెంగుళూర్:
భారత
క్రికెట్
జట్టు
కోచ్జాన్
రైట్,
ఫిజియో
ఆండ్ర్యూ
లీపస్
దక్షిణాఫ్రికాలో
జరిగే
2003
ప్రపంచ
కప్
ముగిసే
వరకు
తమ
తమ
పదవుల్లో
కొనసాగుతారు.
ఈవిషయాన్ని
భారత
క్రికెట్
కంట్రోల్
బోర్డు
(బిసిసిఐ)
అధ్యక్షుడు
జగ్మోహన్
దాల్మియా
ప్రకటించారు.
దీంతోజాన్
రైట్ను,
ఆండ్ర్యూ
సీపస్లను
తొలగిస్తారనే
ఊహాగానాలకు
తెర
పడింది.
సిరీస్ నుంచి సిరీస్కు మధ్యజాన్ రైట్, ఆండ్ర్యూ లీపస్ పనితీరును క్షుణ్నంగా సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. కోచ్జాన్ రైట్, ఫిజియో లీపస్, కెప్టెన్ సౌరబ్ గంగూలీ,సెలెక్టర్ల కమిటీ చైర్మన్ చందూ బోర్డె, సీనియర్ ఆటగాళ్లతో గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీనియర్ ఆటగాళ్లు విఫలమవుతుండడాన్ని విలేకరులు ప్రస్తావించగా జవాబుదారీతనం లోపించిందని, బోర్డు అధ్యక్షుడి నుంచి కింది స్థాయిలో పని చేసే వ్యక్తి వరకు బాధ్యతగా వ్యవహరించడం అవసరమని దాల్మియా అన్నారు.