వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌-పాక్‌ల మధ్య హోరాహోరీ కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ భారత సరిహద్దు వెంబడి అణు క్షిపణులను మోహరించింది. ఈ క్షిపణులు 60 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగలుగుతాయి. వీటిని సింధు, పంజాబ్‌ కంటోన్మెంట్‌ల నుంచి బయలుదేరి సరిహద్దులకు చేరుకున్నాయి.

భారత, పాకిస్థాన్‌ బలగాల మధ్య ఫూంచ్‌, రాజోల్‌ సెక్టార్లలో హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే వుందని భారత సైనికాధికారి చెప్పారు. ఎడ తెరిపి లేకుండా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌ బలగాలను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.

పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ చైనా పర్యటన నుంచి ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చిన అనంతరం త్రివిధ దళాలతో చర్చలు జరిపారు. సైనిక సిబ్బంది సెలవులను రద్దు చేసి విధిగా విధులకు హాజరు కావాలని ముషారఫ్‌ ఆదేశించారు. సరిహద్దులకు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలన తరలిస్తోంది.

అవసరమైతే అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడానికి అందుబాటులో వుండాలని భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మంత్రులను ఆదేశించారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని కూడా ఆయన మంత్రులకు సూచించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించడానికి భారత రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ సోమవారం జమ్మూ వెళ్లారు.

ఇదిలా వుంటే, పాకిస్థాన్‌ బలగాలు జరిపిన కాల్పుల నుంచి జమ్మూ డిప్యూటీ కమిషనర్‌ రోహిత్‌ కన్సాల్‌, జమ్మూ కాశ్మీర్‌ శాసనసభ్యుడు సోమనాథ్‌ తప్పించుకున్నారు. జమ్మూ సెక్టార్‌లోని సాంబా అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద వారి వాహనాలపై పాకిస్థాన్‌ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి.
పాకిస్థాన్‌ బలగాల కాల్పుల్లో ముగ్గురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మరణించిన చోటికి వెళ్లి తిరిగి వస్తుండగా వారిపై కాల్పులు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X