వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజలాలపై మళ్లీ రగడ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఒక రోజు సెలవు తర్వాత సోమవారం నాడు తిరిగి సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో కృష్ణాజలాల వ్యవహారం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. జంటనగరాలకు కృష్ణాజలాల మళ్లింపు వ్యవహారంలో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, సిపిఎం విడివిడిగా ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు.

టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ ప్రతినిధిసురేష్‌ వాయిదా తీర్మానాల ఆమోదం కోసం స్పీకర్‌ను ఒప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. వివిధ పార్టీల నేతలను తాను తన చాంబర్‌కు పిలిపించిమాట్లాడనున్నట్టుస్పీకర్‌ చెప్పారు.

టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖర్‌రావు తాము చెప్పేదివినిపించుకోవల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. వక్ఫ్‌బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదని ఆరోపిస్తూ ఎంఐఎం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడాస్పీకర్‌ తిరస్కరించారు. జీరో ఆవర్‌లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడానికివిఫలప్రయత్నం చేసిన ఎంఐఎం సభ్యులు సభనుంచి ఆగ్రహంతో వాకౌట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X