వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకకు భారత్‌ సహాయం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతి సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీలంకకు సహాయంఅందించడానికి భారత్‌ ముందుకు వచ్చింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్నిపెంచుకోవడానికి ఉభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి.

ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో పాటు అన్ని ద్వైపాక్షిక సంబంధాల గురించి భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే విస్తృతంగా చర్చించారు. నార్వే సహాయంతో చేపట్టిన శాంతి ప్రక్రియ ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

అన్ని విధాల సహాయం అందించడమే తాము శ్రీలంక పట్ట అనుసరిస్తున్న విధానమని సమావేశానంతరం భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌ చెప్పారు.

శ్రీలంక రాజ్యాంగ, ప్రాదేశిక సమగ్రతను దృష్టిలోపెట్టుకుని ఆ దేశంలో సంక్షోభానికి తెర పడాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.మూడు రోజుల పర్యటన కోసం ఇక్కడికి వచ్చినవిక్రమసింఘే భారత హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీతో కూడా చర్చలు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X