వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దుల్లో ఆగని కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌- భారత సరిహద్దుల్లో మంగళవారం కూడా కాల్పులు జరుగుతూనే వున్నాయి. సోమవారం జరిగిన కాల్పుల్లో 22 మంది పాక్‌సైనికులు మరణించారు. 21 పాకిస్థాన్‌ బంకర్లు ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి మరో మూడు బంకర్లుదెబ్బ తిన్నాయి.

అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇరు దేశాలసైన్యాలు మోహరించి వున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలు వాడుతామని పాకిస్థాన్‌ హెచ్చరించింది. పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌లలోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

భారత మిలటరీ జెట్లు సరిహద్దుల్లో మోహరిస్తున్నాయి. యుద్ధవిమానాలు కాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తర భారత సరిహద్దుల్లోకి తరలుతున్నాయి.వీటిని ముందు జాగ్రత్త చర్యగా
మాత్రమే తరలిస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులంటున్నారు.

యుద్ధ టాంకులను, సైనిక బలగాలను సరిహద్దులకు తరలిస్తున్నట్లుస్టేట్స్‌మన్‌ పత్రిక రాసింది. ఫ్రెంచ్‌ తయారీ మిరేజ్‌ 2000, రష్యన్‌మిగ్‌ 29, సుకోయి 30 యుద్ధ విమానాలను సిద్ధం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X