వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నులకు గ్రామాభివృద్ధికి వెంకయ్య లంకె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పన్నులు కచ్చితంగా వసూలు చేసే గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు.
ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 77వ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలంలోని ఒక గ్రామంలో మంగళవారం ఏర్పాటయిన సభలో ఆయన ప్రసంగించారు.
గ్రామ పంచాయతీలు పన్నుల వసూలుపై శ్రద్ధ చూపాలని, పన్నులు వసూలు చేసే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం పన్నులు వసూలు చేయడం ఆపకూడదని ఆయన సూచించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో నిర్దిష్ట కాలపరిమితితో పథకాలు చేపట్టి అమలు చేస్తుందని ఆయన చెప్పారు.

టెలిఫోన్‌ వినియోగదారులను పన్ను చెల్లింపు నుంచిమినహాయించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్‌అందించాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన వ్యతిరేకించారు. ఉచితంగా కరెంట్‌ ఇవ్వడం వల్ల రెవెన్యూ రాక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు.

వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో 77 కిలోల కేక్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ కట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X