వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌లో నలుగురు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ నడిబొడ్డున పోలీసులతో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురుపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హతమయ్యారు. సోమవారం రాత్రి హన్మకొండ పోలీసుస్టేషన్‌ను నక్సల్స్‌ పేల్చివేసిన విషయం తెలిసిందే.
ఈ ఎన్‌కౌంటర్‌ మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో వరంగల్‌లోని పద్మాక్షి గుట్టలో జరిగింది.

సోమవారం రాత్రి పోలీసు స్టేషన్‌ను పేల్చివేసిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టినట్లు, గాలింపు చేస్తున్న పోలీసులకు ఆయుధాలు, మందుగుండ సామగ్రి కలిగి వున్న ఏడెనిమిది మంది నక్సల్స్‌ తారసపడినట్లు వరంగల్‌ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ నళినీ ప్రభాత్‌ చెప్పారు. పోలీసులను చూడగానే నక్సల్స్‌ కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, ఈఎదురు కాల్పుల్లో నలుగురు నక్సల్స్‌హతమయ్యారని ఆయన వివరించారు.

ఎస్‌పి నళినీ ప్రభాత్‌ చెప్పిన వివరాల ప్రకారం- ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సల్స్‌లో బిసాడి శంకర్‌ (26) ఆటో డ్రైవర్‌. వరంగల్‌ జిల్లా రేగొండ మండలం నిజాంపల్లికి చెందిన ఇతను వరంగల్‌లోని గిర్మాజీ పేటలో వుంటూ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఇతనిపై దాదాపు పది కేసులున్నాయి.

గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన బందల సురేందర్‌ (24) ఇఎస్‌ఐ ఆస్పత్రిలో అంబులెన్స్‌ క్లీనర్‌. ఇతనిపై మూడు కేసుల్లో నిందితుడు. మరో నక్సలైట్‌ గాదె చంద్రశేఖర్‌ (38) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇతని స్వస్థలం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామం. మరణించిన నక్సలైట్లలో మరొకరిని గుర్తించాల్సి వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X