వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీవ్రవాద నిరోధానికే పాక్ తో పోరుఃఅద్వానీ
న్యూఢిల్లీః తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాల్సిందిగా కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ పాకిస్తాన్ కు హితవు చెప్పారు. తీవ్రవాద నిరోధానికే పాకిస్తాన్ తో దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రారంభించినట్లు శుక్రవారం జరిగిన 62వ సి.ఆర్.పి.ఎఫ్. వార్షికోత్సవాల్లో వెల్లడించారు. పాకిస్తాన్ 15 ఏళ్ళుగా భారత్ తో పరోక్ష యుద్ధం చేస్తునే వున్నదని ఆయన అన్నారు. గతంలో మూడు యుద్ధాల్లో పరాజయం పాలైనా పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాలేదని అద్వానీ విమర్శించారు.
పాకిస్తాన్ వైఖరిలో మార్పు తీసుకవచ్చే లక్ష్యంతోనే దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. తీవ్రవాదం కొమ్ముకాసే వైఖరి మార్చుకోక పోతే పాకిస్తాన్ ను ఉపేక్షించే ప్రశ్నే లేదని ఆయన తేల్చి చెప్పారు. దేశ రక్షణలో సి.ఆర్.పి.ఎప్. నిర్వహిస్తున్న పాత్రను అద్వానీ కొనియాడారు.
Comments
Story first published: Friday, December 28, 2001, 23:53 [IST]