బల్దియా: టిఆర్ఎస్తో టిఎస్ఎస్ చర్చలు
హైదరాబాద్:
హైదరాబాద్
నగర
పాలక
సంస్థ
(ఎంసిహెచ్)
ఎన్నికల్లో
పొత్తుకు
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(టిఆర్ఎస్)తో
చర్చలు
జరుపుతున్నట్లు
తెలంగాణ
సాధన
సమితి
(టిఎస్ఎస్)
నేత
ఎ.
నరేంద్ర
చెప్పారు.
తాము
అన్ని
స్థానాల్లో
పోటీ
చేస్తామని
ఆయన
శుక్రవారం
విలేకరుల
సమావేశంలో
చెప్పారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలంగాణావాదులందరితో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజా సమితి ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకునే పార్టీలు, సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం, మజ్లీస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, నగర పాలక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటు కోసం శుక్రవారం బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య శుక్రవారం కూడా చర్చలు జరిగాయి. హిందూపురం సీటును బిజెపికి ఇవ్వడానికి తెలుగుదేశం ఇష్టపడటం లేదు. అలాగే గడ్డిఅన్నారం సీటు విషయంలో కూడా అంగీకారం కుదరడం లేదు. హైదరాబాద్ నగర పాలక సంస్థలో బిజెపికి 20 సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం ముందుకు వచ్చింది. అయితే, ఎక్కవ సీట్ల కోసం బిజెపి డిమాండ్ చేస్తోంది.