ఇండో-పాక్ ఉద్రిక్తతలు అమెరికాకు సమస్య
వాషింగ్టన్:
ఇండో-
పాక్ల
మధ్య
ఉద్రిక్తతలు
పెరిగితే
అఎn్ఘానిస్థాన్లో
తమ
ఆపరేషన్స్కు
సమస్యలు
ఎదురవుతాయని
అమెరికా
అభిప్రాయపడింది.
సహజంగానే ఇది క్లిష్టమైన, ఉద్రిక్త పరిస్థితి. అధ్యక్షుడు (జార్జి బుష్), విదేశాంగ మంత్రి (కొలిన్ పావెల్), ఇతరులు కొద్ది రోజులుగా రెండు ప్రభుత్వాలతో సంభాషిస్తున్నారు. ప్రతి రోజు ఒకటో రెండో ఫోన్ కాల్స్ చేస్తూనే వున్నారు. ఈ విషయంపై చర్చలు జరుపుతూనే వున్నారు అని అమెరికా రక్షణ శాఖ మంత్రి డోనాల్డ్ రమ్స్ఫీల్డ్ విలేకరులతో అన్నారు.
అఎn్ఘానిస్థాన్ సరిహద్దుల నుంచి పాకిస్థాన్ తన బలగాలను తొలగించలేదని, ఇది అమెరికాకు ప్రోత్సాహకరమైన విషయమని, పాకిస్థాన్ బలగాలు ప్రధానమైన భూమికను పోషిస్తున్నందున అఎn్ఘానిస్థాన్ సరిహద్దుల నుంచి ఆ బలగాలను తొలగిస్తే అమెరికాకు నిరాశే ఎదురవుతుందని ఆయన అన్నారు.
అఎn్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఎనిమిది, తొమ్మిది పాకిస్థాన్ బెటాలియన్లు ఉన్నాయని, అఎn్గానిస్థాన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నవారిని అవి అడ్డుకుంటున్నాయని ఆయన చెప్పారు.